తొలగించిన ఓటర్ల జాబితాను వెల్లడించిన ఇసి
న్యూఢిల్లీ : బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఎన్నికల సంఘం దాదాపు 65 లక్షల మంది ఓటర్లను తొలగించింది. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సుప్రీంకోర్టులో దీనిపై పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా తొలగించిన ఓటర్ల జాబితాను ఆగస్టు 19 లోగా బయటపెట్టాలని, ఆగస్టు 22వ తేదీలోగా ఎస్ఐఆర్పై నివేదికను కోర్టు ముందు సమర్పించాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగించిన 65 లక్షల ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ తొలగించిన జాబితాలో ఎఎస్డి (ఆబ్సెంట్, షిఫ్ట్, డెడ్) ఓటర్ల జాబితాను విడుదల చేసింది. బీహార్లోని రోహ్తాస్, బెగుసరారు, అర్వాల్, ఇతర పోలింగ్ బూతుల్లో తొలగించిన ఓటర్ల జాబితాను ప్రదర్శనకు ఉంచినట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సిఇఓ) తెలిపారు
What's Your Reaction?
Like
3
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0