లంచం వసూలు చేసి.. పట్టుబడ్డాక కన్నీళ్లు”

Sep 9, 2025 - 15:28
Sep 9, 2025 - 16:21
 0  10.3k
  • “టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పట్టుబాటు: అవినీతి మూలాలు ఎంత లోతు?”

Hyderabad : నర్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో చోటుచేసుకున్న తాజా లంచం ఘటన మరోసారి అధికార యంత్రాంగం పట్ల ప్రజల్లో ఉన్న అనుమానాలను బలపరుస్తోంది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణి హరికను ఒక ఫ్లాట్ LRS కోసం ₹10 లక్షల లంచం డిమాండ్ చేసి,  వినోద్ వద్ద 4 లక్షలు తీసుకుంటూ  ACBకి పట్టుబడింది. అధికారుల చేతిలో చిక్కుకున్న వెంటనే మణి హరిక కన్నీటి పర్యంతమవడం, బాధ్యత తప్పించుకోవాలన్న ప్రయత్నమే తప్ప వేరేం కాదని స్పష్టమవుతోంది. 

సమాచారం ప్రకారం, ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కట్టడాల వ్యవహారాల్లో విరుచుకుపడి, ఒక్క పని కూడా లంచం లేకుండా చేయలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. చిన్న చిన్న పనులకే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ లంచం కోసం వేధించేదని స్థానికులు చెబుతున్నారు.ప్రజల కష్టాలను అర్థం చేసుకోవాల్సిన అధికారిణి, లంచం కోసం కన్నీళ్లు పెట్టుకోవడం మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది.

ఇది ఒక వ్యక్తి తప్పిదం మాత్రమే కాదు, మున్సిపల్ విభాగంలో మూలాల వరకూ విస్తరించిన అవినీతి వ్యవస్థకు సూచిక. ప్రతీ పని కోసం లంచం తప్పనిసరి అన్న వాతావరణం ప్రజల్ని తీవ్రంగా విసిగిస్తోంది. లంచం లేకుండా ఫైల్ కదలని పరిస్థితి సాధారణ ప్రజల జీవితాలను ఇబ్బందులకు గురిచేస్తోంది.

ACB వరుస దాడులు చేస్తూనే ఉన్నా, అవినీతి ధోరణిలో పెద్ద మార్పు కనిపించడం లేదు. పట్టుబడినవారు ఒక రోజు వార్తల్లో నిలుస్తారు, కానీ కొద్దికాలం తరువాత మరొకరు అదే స్థానం దక్కించుకుని అదే పనులు చేస్తుంటారు. ఈ పరిస్థితికి కారణం శిక్షలలోని లోపం, వ్యవస్థలోని బలహీనత.

ప్రజల ఆస్తులపై, భవిష్యత్తుపై ప్రభావం చూపే పట్టణ ప్రణాళిక వంటి కీలక విభాగాల్లో లంచం కేసులు బహిర్గతం కావడం ఆందోళనకరం. పట్టుబడిన అధికారులు కన్నీళ్లు పెట్టుకోవడం కాదు, ప్రజల కష్టాలను అర్థం చేసుకోవడం, నిజాయితీతో పనిచేయడం అవసరం.అవినీతి దాడులతో మాత్రమే తగ్గదు. కఠిన శిక్షలు, పారదర్శక వ్యవస్థ, ప్రజల్లో అవగాహన పెరిగినప్పుడే నిజమైన మార్పు సాధ్యం అవుతుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0