పవన్ కల్యాణ్కు సీఎం చంద్రబాబు పరామర్శ – ఆరోగ్యం, రాజకీయాలపై చర్చ
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత ఐదు రోజులుగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. అస్వస్థత మధ్యే ఆయన ఇటీవల అసెంబ్లీకి హాజరై, తన శాఖలపై సమీక్షలు నిర్వహించడం గమనార్హం. అనంతరం వైద్యుల సలహా మేరకు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిని సంప్రదించినా జ్వరం పూర్తిగా తగ్గకపోవడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం హైదరాబాద్లోని పవన్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు, త్వరగా కోలుకోవాలని పవన్కు ధైర్యం చెప్పారు. ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలపై, ముఖ్యంగా బాలకృష్ణ – చిరంజీవి వ్యాఖ్యలపై కూడా వీరి మధ్య చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం లభించింది. బాలకృష్ణ మానసిక పరిస్థితి గురించి వివరణ కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన తరువాత పవన్ కల్యాణ్ నిరంతరంగా చురుకైన పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఆరోగ్య సమస్యలతో కొంత ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన చూపిస్తున్న తపనను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించినట్లు తెలుస్తోంది.
రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ పరామర్శకు ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తోంది. పవన్ ఆరోగ్యం పట్ల ఆందోళనతో పాటు, ఇద్దరు కీలక నేతల మధ్య తాజా పరిణామాలపై చర్చ జరగడం భవిష్యత్ రాజకీయ సమీకరణలపై ఊహాగానాలకు తావిస్తోంది.
What's Your Reaction?






