వరలక్ష్మీ వ్రతాల సందడి – పిఠాపురంలో పవన్ కల్యాణ్ చీరల పంపిణీ
పిఠాపురం:
శ్రావణమాసం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో శుక్రవారం ఉదయం నుంచే సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఆచారం ప్రకారం ఎప్పటిలానే ఈసారి కూడా ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళలకు చీరలు అందజేశారు.
తన స్వంత ఖర్చులతోనే నియోజకవర్గంలోని దాదాపు 10 వేల మంది ఆడపడుచులకు పసుపు, కుంకుమ, చీరలను పంపిణీ చేయాలని పవన్ ముందడుగు వేశారు. ఈ కార్యక్రమాన్ని ఆయన జనసేన సైనికుల ద్వారా నిర్వహిస్తున్నారు.
ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉండి, మరోవైపు సినీ రంగంలో కూడా నటిస్తూ, ప్రజల కోసం ఎప్పటికప్పుడు సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్నారని స్థానికులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలులోకి వచ్చాయని, భవిష్యత్తులో మరింత ప్రజలకు తోడ్పడతారని వారు చెప్పారు.
What's Your Reaction?






