కొండయ్యపాలెంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు – సేవా కార్యక్రమాలతో సందడి
కాకినాడ, కొండయ్యపాలెం :
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడ 46వ వార్డు కొండయ్యపాలెంలో ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఇన్చార్జ్ మోల్లేటి భగవాన్ ఆధ్వర్యం వహించారు.
మొదటగా పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం వందలాది మందికి అన్నసంతర్పణ చేసి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ తోట కుమార్ హాజరై, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వల్ల రాష్ట్రంలో జరుగుతున్న మార్పులను గుర్తుచేసి, ప్రజల కోసం ఆయన చేస్తున్న త్యాగసేవలను కొనియాడారు. ఆయన మాట్లాడుతూ – “పవన్ కళ్యాణ్ గారు ప్రజల హక్కుల కోసం, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎల్లప్పుడూ ముందుండి పోరాటం చేస్తున్నారు. అలాంటి మహానేత పుట్టినరోజు మనందరికీ ఒక పండుగ వంటిది” అని పేర్కొన్నారు.
అదేవిధంగా జనసేన వీరమహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకలో పాల్గొన్నారు. కొండయ్యపాలెంలో జరిగిన ఈ సేవా కార్యక్రమం సందర్భంగా వందలాది మందికి అన్నసంతర్పణ చేయడం ప్రత్యేక విశేషం. స్థానిక ప్రజలు, అభిమానులు ఈ కార్యక్రమాన్ని అభినందించారు.
కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన మోల్లేటి భగవాన్, పార్టీ కార్యకర్తలకు నాయకులు అభినందనలు తెలిపారు.
What's Your Reaction?






