రూ. 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రెవెన్యూ ఆఫీసర్

వికారాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు... రూ. 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రెవెన్యూ ఆఫీసర్..
మ్యుటేషన్ కోసం ఆశ్రయించిన బాధితుడి నుంచి రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశారు రెవెన్యూ ఆఫీసర్ రమేష్. దీంతో ఏసీబీని ఆశ్రయించారు బాధితుడు. బాధితుడి ఫిర్యాదుతో మున్సిపల్ ఆఫీసుపై దాడులు నిర్వహించిన అధికారులు రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.రెవెన్యూ ఆఫీసర్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల మెరుపు దాడులతో దూకుడు పెంచారు ఏసీబీ అధికారులు. ఎక్కడికక్కడ దాడులు నిర్వహిస్తూ అవినీతి అధికారులను కట్టడి చేస్తున్నారు అధికారులు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు ఏసీబీ అధికారులు.
What's Your Reaction?






